నాలుకను కోసి దేవుడికి నైవేద్యంగా సమర్పించిన మూడభక్తుడు
ABN , First Publish Date - 2020-10-26T12:43:53+05:30 IST
దసరా పర్వదినం రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు దిగ్భ్రాంతికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి....
పట్నా (బీహార్): దసరా పర్వదినం రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు దిగ్భ్రాంతికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాబేరు ప్రాంతంలోని భాటి గ్రామ ఆలయంలో 22 ఏళ్ల యువకుడు తన నాలుక కోసుకున్నాడు. ఆత్మారామ్ అనే 22 ఏళ్ల యువకుడు ఆలయానికి వచ్చి తన నాలుకను కత్తిరించి దేవుడికి నైవేద్యంగా అర్పించాడని పోలీసులు చెప్పారు. తీవ్ర రక్తస్రావమైన ఆత్మారాంను ఆసుపత్రికి తరలించామని, అతని పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు చెప్పారు. తన కుమారుడికి మతిస్థిమితం సరిగా లేదని, నవరాత్రి సందర్భంగా నాలుక కోసుకున్నాడని ఆత్మారాం తండ్రి చెప్పారు. మరో ఘటనలో యూపీలోని కురారా ప్రాంతంలోని శివాలయంలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా కోకేశ్వర్ ఆలయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రుక్మిణి మిశ్రాను ఆసుపత్రికి తరలించారు.మూఢనమ్మకాల వల్లనే వీరిద్దరూ ఈ చర్యకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ చెప్పారు.