పక్కింటి వ్యక్తితో భార్య ఎఫైర్.. వద్దని చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆ భర్త పిల్లలను తీసుకుని సెల్ టవర్ ఎక్కి..

ABN , First Publish Date - 2022-01-27T22:30:05+05:30 IST

ఆ వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..

పక్కింటి వ్యక్తితో భార్య ఎఫైర్.. వద్దని చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆ భర్త పిల్లలను తీసుకుని సెల్ టవర్ ఎక్కి..

ఆ వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అతని భార్య పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఒకసారి భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.. అయినా ఆమె తీరు మారలేదు.. భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు.. దీంతో ఆ భర్త పిల్లలతో కలిసి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు.. పోలీసులు, స్థానికులు గంటన్నర పాటు నచ్చ చెప్పడంతో కిందకు దిగి వచ్చాడు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలోని అక్బర్‌పూర్‌లో ఉన్న ఓ సెల్ టవర్ పైకి ఓ వ్యక్తి సోమవారం ఉదయం తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఎక్కాడు. 40 అడుగుల ఎత్తున్న ఆ టవర్ పైకి ఓ వ్యక్తి ఇద్దరు చిన్న పిల్లలతో ఎక్కుతుండడాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అతడితో మాట్లాడారు. తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, తను వార్నింగ్ ఇచ్చినా వినడం లేదని చెప్పాడు. 


పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా పట్టించుకోలేదని, అందుకే పిల్లలతో కలిసి చనిపోదామని నిర్ణయించుకున్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటన్నర హైడ్రామా తర్వాత పోలీసుల హామీ మేరకు అతను కిందకు దిగి వచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని, అతడి భార్యను, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పక్కింటి వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముగ్గురికీ కౌన్సిలింగ్ ఇప్పించారు.  

Updated Date - 2022-01-27T22:30:05+05:30 IST