మద్దెల్‌చెరువులో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-28T06:56:49+05:30 IST

మండలంలోని మద్దెల్‌చెరువు గ్రామంలో సాయిలు (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రంజిత్‌ తెలిపారు.

మద్దెల్‌చెరువులో వ్యక్తి ఆత్మహత్య

పిట్లం, జనవరి 27: మండలంలోని మద్దెల్‌చెరువు గ్రామంలో సాయిలు (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రంజిత్‌ తెలిపారు. మద్దెల్‌ చెరువు గ్రామానికి చెందిన గోల్ల సాయిలు కుటుంబ సమస్యలతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది తన మేకల కొట్టంలో ఉరేసుకున్నారు. మృతుడి తల్లి రామవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నాడు.

Updated Date - 2022-01-28T06:56:49+05:30 IST