కుప్పకూలిన యువకుడు... ఆ తర్వాత మృతి
ABN , First Publish Date - 2020-07-08T20:46:32+05:30 IST
నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటన అందరినీ నివ్వెరపరుస్తోంది. ఈసీఐఎల్ చౌరస్తాలో మధ్యహ్నం సమయంలో ఓ యువకుడు కుప్పకూలిపోయాడు.
హైదరాబాద్: నడిరోడ్డుపై ఓ యువకుడు కుప్పకూలిపోయిన ఘటన అందరినీ నివ్వెరపరుస్తోంది. నగరంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో మధ్యహ్నం సమయంలో ఓ యువకుడు కుప్పకూలిపోయాడు. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొద్దిసేపటికి అక్కడికి అంబులెన్స్ వచ్చింది. సిబ్బంది అతడిని పరిశీలించగా.. అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు.
సదరు యువకుడిని జవహర్నగర్కు చెందిన పృథ్విగా గుర్తించారు. పృథ్వి మూడు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం.