Thrissur:ఎగిరే నెమలి బుల్లెట్‌ను తాకి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-08-17T15:32:52+05:30 IST

త్రిస్సూర్ రైల్వేస్టేషనుకు మోటారుసైకిలుపై భార్యను తీసుకువెళుతుండగా ఎగురుతున్న నెమలి తాకడంతో నియంత్రణ కోల్పోయి మోటారిస్టు రోడ్డుపై పడి మరణించిన ఘటన...

Thrissur:ఎగిరే నెమలి బుల్లెట్‌ను తాకి వ్యక్తి మృతి

త్రిస్సూర్ : త్రిస్సూర్ రైల్వేస్టేషనుకు మోటారుసైకిలుపై భార్యను తీసుకువెళుతుండగా ఎగురుతున్న నెమలి తాకడంతో నియంత్రణ కోల్పోయి మోటారిస్టు రోడ్డుపై పడి మరణించిన ఘటన త్రిస్సూర్ లో వెలుగుచూసింది. త్రిస్సూర్ నగరానికి చెందిన ప్రమోష్ అనే యువకుడు తన భార్యను రైల్వేస్టేషనులో డ్రాప్ చేసేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌ పై తీసుకువెళుతుండగా, అయ్యంతోల్ ప్రాంతం వద్ద వరి పొలంలో నుంచి ఒక్కసారిగా ఎగిరిన నెమలి అతన్ని తాకింది. దీంతో బుల్లెట్ పై నుంచి కిందపడిన ప్రమోష్ తీవ్ర గాయాల పాలయ్యాడు.


దీంతో అతన్ని వెంటనే కారులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రమోష్ మరణించాడని వైద్యులు చెప్పారు. బుల్లెట్ పై వస్తున్న ప్రమోష్ భార్య తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమోష్ జంటకు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన నెమలి కూడా మరణించింది. 


Updated Date - 2021-08-17T15:32:52+05:30 IST