మల్లన్న సాగర్ కాలువ నీటిలో మునిగి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-21T05:11:29+05:30 IST
కాలువలో స్నానం చేయడానికి వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మంగళవారం జరిగింది.
కొండపాక, ఏప్రిల్ 20: కాలువలో స్నానం చేయడానికి వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మంగళవారం జరిగింది. కుకునూరుపల్లి ఎస్ఐ సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన వల్లభనేని అశోక్(32) అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు సంపత్యాదవ్తో డీసీఎంలో కొండపాక మండలం కొడకండ్ల శివారులోని ప్రసాద్ సీడ్స్ కంపెనీకి మొక్కజొన్న, ధాన్యం బస్తాలు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం ఏడు గంటలకు కంపెనీ వద్దకు చేరుకొన్న డీసీఎంను నిలిపివేశారు. ఈ క్రమంలోనే సమీపంలోని మల్లన్న సాగర్ కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి అశోక్ వెళ్లి తిరిగి రాలేదు. కొద్ది సేపటి తర్వాత సంపత్ కాలువ వద ్దకు వెళ్లి చూడగా గట్టుపై దుస్తులు కనిపించాయి. గజ ఈతగాళ్లతో కాలువలో గాలించడంతో సాయంత్రం మృతదేహం లభ్యమైంది. అతడికి ఈత రాకపోవడంతోనే నీటిలో మునిగి మృతిచెంది ఉంటాడని, కేసు నమోదు చేసకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.