రోడ్డు పక్కన డ్రైనేజీ కాలువ వద్ద నిలబడి ఓ శునకం అరుపులు.. ఏంటా అని అనుమానంతో స్థానికులు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-01-07T21:16:08+05:30 IST

రద్దీగా ఉండే రోడ్డు పక్కన డ్రైనేజీ.. అక్కడ నిలబడి ఓ కుక్క అరుస్తోంది..

రోడ్డు పక్కన డ్రైనేజీ కాలువ వద్ద నిలబడి ఓ శునకం అరుపులు.. ఏంటా అని అనుమానంతో స్థానికులు వెళ్లి చూస్తే..

రద్దీగా ఉండే రోడ్డు పక్కన డ్రైనేజీ.. అక్కడ నిలబడి ఓ కుక్క అరుస్తోంది.. అనుమానం వచ్చి అక్కడకు వెళ్లి చూసిన స్థానికులు షాకయ్యారు.. లోపల ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో ఈ ఘటన జరిగింది. 


రోహ్‌తక్‌లోని చున్నీపుర కాలనీలో ఉన్న ఓ డ్రైనేజీలో గురువారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆ వ్యక్తిని తాపీ పని చేసే మేస్త్రి సూరజ్ ప్రకాష్‌గా పోలీసులు గుర్తించారు. అతని మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. విపరీతంగా మద్యం సేవించి ఆ కాలవలో పడిపోయి ఉంటాడని, నీరు బాగా ఎక్కువ ఉండడంతో ఊపిరి ఆడక మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ వచ్చాకే దర్యాఫ్తు ప్రారంభిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

Updated Date - 2022-01-07T21:16:08+05:30 IST