అర్ధరాత్రి భార్య అరుపులు విని నిద్రలేచిన భర్తకు కనిపించిందో దారుణ దృశ్యం.. అతడెవరో గుర్తుపట్టి షాక్.. చివరకు..

ABN , First Publish Date - 2021-09-08T20:38:04+05:30 IST

ఇంట్లో వాళ్లంతా జాగరణ చేయడం కోసం ఊరిలోని గుడికెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అన్న, వదిన మాత్రమే ఉన్నారు. వాళ్లు కూడా నిద్రపోతున్నారు.

అర్ధరాత్రి భార్య అరుపులు విని నిద్రలేచిన భర్తకు కనిపించిందో దారుణ దృశ్యం.. అతడెవరో గుర్తుపట్టి షాక్.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో వాళ్లంతా జాగరణ చేయడం కోసం ఊరిలోని గుడికెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అన్న, వదిన మాత్రమే ఉన్నారు. వాళ్లు కూడా నిద్రపోతున్నారు. ఇదే అదనుగా భావించిన మరిది నీచానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న వదినపై అఘాయిత్యం చేయబోయాడు. అలికిడికి మేల్కొన్న ఆ ఇల్లాలు గట్టిగా అరిచింది. ఆ కేకలకు కళ్లు తెరిచిన ఆమె భర్త నందరామ్.. తన తమ్ముడు చేయబోయిన ఘనకార్యం చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కండువా తీసుకొని తమ్ముడి మెడకు బిగించాడు. అతను గిలగిల్లాడి మరణించే వరకూ వదల్లేదు.


ఇది కూడా చదవండి: రాత్రి ఆలస్యంగా వచ్చిన భర్త.. ఇంట్లో అంతా చీకటి.. పిలిచినా పలకని భార్య.. లైట్ వేసి చూస్తే..

ఇది కూడా చదవండి: అద్దె గదిలో ప్రియుడితో సహజీవనం.. ఏడాది తర్వాత అసలు నిజం బయటపెట్టి భారీ షాకిచ్చిన ప్రేయసి..


తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి ఆ మృతదేహాన్ని ఇంటి బయటకు తీసుకెళ్లి పడేశారు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశ్యంతో తమ్ముడి మెడపై గొడ్డలితో దాడి చేశాడా అన్న. తెల్లవారుజామున నాలుగు గంటలు ఆలయం నుంచి తిరిగొచ్చిన కుటుంబం ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి పడుకున్నారు. ఉదయాన్నే నిద్ర లేచిన ఆ కుటుంబానికి ఇంటి బయట నందరామ్ సోదరుడు లాల్‌రామ్ మృతదేహం కనిపించింది. దీంతో ఆ కుటుంబంలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అందర్నీ విచారించారు. ఈ సందర్భంగా జరిగిన దారుణాన్ని నందరామ్ (40), అతని భార్య గోరోదేవీ (35) అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-08T20:38:04+05:30 IST