కరోనా రోగి కుమారుడు డాక్టరుపై దాడి

ABN , First Publish Date - 2020-07-30T13:02:58+05:30 IST

డాక్టరు నిర్లక్ష్యం వల్లనే కరోనాతో తన తల్లి మరణించిందనే కోపంతో మృతురాలి కుమారుడు కత్తితో డాక్టరుపై దాడి చేసిన ఘటన

కరోనా రోగి కుమారుడు డాక్టరుపై దాడి

లాతూర్ (మహారాష్ట్ర): డాక్టరు నిర్లక్ష్యం వల్లనే కరోనాతో తన తల్లి మరణించిందనే కోపంతో మృతురాలి కుమారుడు కత్తితో డాక్టరుపై దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో వెలుగుచూసింది. ఉద్గిర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కరోనా సోకడంతో ఆమెను లాతూర్ నగరంలోని అల్ఫా ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. దీంతో డాక్టరు నిర్లక్ష్యం వల్లనే తన తల్లి కరోనాతో మరణించిందనే కోపంతో ఆమె కుమారుడు డాక్టర్ దినేష్ వర్మపై కత్తితో దాడి చేశాడు. డాక్టరు దినేష్ వర్మకు ఛాతీ, మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వర్మను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 

Updated Date - 2020-07-30T13:02:58+05:30 IST