మంత్రి మల్లారెడ్డి గన్మన్ అంటూ హల్చల్
ABN , First Publish Date - 2020-08-07T14:53:26+05:30 IST
మంత్రి మల్లారెడ్డి గన్మన్ అంటూ హల్చల్
కార్వాన్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): మంత్రి మల్లారెడ్డి గన్మన్ అంటూ ఓ వ్యక్తి యూపీహెచ్సీలో హల్చల్ చేశాడు. మెహిదీపట్నం గుడిమల్కాపూర్ యూపీహెచ్సీలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. కరోనా పరీక్ష చేసేందుకు ప్రభుత్వం కిట్లు ఇస్తుండగా గురువారం ఇవ్వలేదు. దీంతో వైద్యసిబ్బంది పరీక్షలు చేయించుకునేందుకు శుక్రవారం రావాలని చెప్పారు. దీంతో ఓ వ్యక్తి తాను మంత్రి మల్లారెడ్డి గన్మన్ అని, తనకు కూడా పరీక్షలు చేయరా అంటూ వైద్యాధికారిపై చిందులు వేశాడు. ఇం తలో ఓ వ్యక్తి వైద్యాధికారికి ఫోన్ చేసి తాను మల్లారెడ్డి పీఏనని, అతడికి కరోనా పరీక్షలు చేయాలని చెప్పాడు. దీంతో వైద్యసిబ్బంది ఆసిఫ్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.