పెద్ద కొడుకు మరణం.. దుఃఖంలో ఉన్న తల్లిని రెండోవాడు ఘోరంగా..

ABN , First Publish Date - 2020-07-31T01:34:17+05:30 IST

కన్న తల్లిపైనే ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అన్నంటే తల్లికి ఇష్టమనే అపోహకు లోనైనా ఆమెను గొంతుకోసి హతమార్చాడు.

పెద్ద కొడుకు మరణం.. దుఃఖంలో ఉన్న తల్లిని రెండోవాడు ఘోరంగా..

రెవా: కన్న తల్లిపైనే ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అన్నంటే తల్లికి ఇష్టమనే అపోహకు లోనై ఆమెను గొంతుకోసి హతమార్చాడు. మధ్యప్రదేశ్‌లో రేవా జిల్లాలో ఈ దారుణం జరిగింది. నిందితుడు కొంత కాలంగా ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడు తల్లిపై కోపం పెంచుకున్నాడన్నారు. అన్న అంటేనే తల్లికి ఇష్టమనే అపోహతో రగిలి పోయాడు. ఈ క్రమంలోనే ఇటీవల అతడు ఆమెను గొంతు కోసం చంపేశాడు. అంతేకాకుండా ఈ ఘాతుకాన్ని కెమెరాతో చిత్రీకరించాడు. తన భార్యను ఎవరో చంపి అడవిలో పడేశారంటూ నిందితుడి తండ్రి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా తండ్రి తన చిన్నకొడుకుపైనే అనుమానం వ్యక్తం చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే ఏడాది క్రితం పెద్ద కుమారుడు చనిపోయాడని పోలీసుల తెలిపారు. ఆప్పటి నుంచి తల్లి తీవ్ర ఆవేదన చెందేదని, నిరంతరం రోదించేదని చెప్పారు. అయితే నిరుద్యోగి అయిన చిన్న కొడుకు ఇదంతా చూసి..తల్లికి పెద్ద కొడుకంటేనే ఇష్టమని అపోహపడ్డాడు. ఇలా తల్లిపై కోపం పెంచుకుని చివరికి ఆమెను హత్య చేసే వరకూ వెళ్లాడని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-07-31T01:34:17+05:30 IST