బైక్తో డివైడర్ను ఢీకొని వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2021-05-08T06:05:13+05:30 IST
బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గౌరారం రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగింది.
వర్గల్, మే 7: బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గౌరారం రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగింది. గౌరారం ఎస్ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట సిరిసిల్లా గ్రామానికి చెందిన సావనిపల్లి అంతయ్య(50), ఇల్లంతకుంటకు చెందిన సత్యనారాయణ రెడ్డితో కలిసి మధ్యాహ్నం బైక్పై రాజీవ్ రహదారి గుండా హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో గౌరారం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టడంతో ఇద్దరు కిందపడ్డారు. అంతయ్య తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.