భర్తతో గొడవపడి కోర్టు మెట్లెక్కిన భార్య.. ఇంటికి తిరిగి వచ్చిన ఆమెతో గొడవపడిన మామ ఎంత పని చేశాడంటే..
ABN , First Publish Date - 2021-12-02T22:18:01+05:30 IST
భర్తతో గొడవపడి కోర్టు మెట్లెక్కిన కోడలిపై అతను కోపం పెంచుకున్నాడు.. ఆమెకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు..
భర్తతో గొడవపడి కోర్టు మెట్లెక్కిన కోడలిపై అతను కోపం పెంచుకున్నాడు.. ఆమెకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు.. ఆమె ఇంటికి రాగానే ఆమెతో గొడవపడ్డాడు.. అనంతరం కత్తితో ఆమెను అంతమొందించాడు.. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.
తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని జంగాలపురం గ్రామనికి చెందిన మణి కొడుకు శివన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతని భార్య మురుగమ్మాల్కు ఏడాది క్రితం టీచర్గా ప్రభుత్వోద్యోగం వచ్చింది. అయితే ఆమె నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగం పొందినట్టు రుజువుకావడంతో ఉద్యోగం పోయింది. ఈ నేపథ్యంలో శివన్, మురుగమ్మాల్ మధ్య గొడవలు పెరిగాయి. దీంతో మురుగమ్మాల్ తన కొడుకు, కూతురితో కలిసి వేరే ఊరికి మకాం మార్చింది. అంతేకాదు భర్త నుంచి విడాకులు కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది.
మంగళవారం మురుగమ్మాల్ జంగాలపురంలోని అత్తింటికి వెళ్లింది. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో తమ ఇంటికి ఎందుకు వచ్చావని మురుగమ్మాల్ను మామ మణి నిలదీశాడు. దీంతో గొడవ జరిగింది. బుధవారం ఉదయం మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. ఆగ్రహించిన మణి ఇంటిలో ఉన్న కత్తితో మురుగమ్మాల్ను హత్య చేసి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.