రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-06-23T06:31:41+05:30 IST
మండల ప రిధిలోని లోలూరు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో మహబూబ్ బాషా(35) అనే బొలేరో వాహన డ్రైవర్ మృతి చెందాడు.
శింగనమల, జూన22 : మండల ప రిధిలోని లోలూరు క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో మహబూబ్ బాషా(35) అనే బొలేరో వాహన డ్రైవర్ మృతి చెందాడు. శింగనమల ఎస్ఐ వంశీకృష్ణ వివరా ల మేరకు... కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్కు చెందిన బొలేరో వాహనం తెలంగాణ రాష్ట్రం నల్గొండలో ద్రాక్షను అనలోడ్ చేసి తిరిగి చిక్బళ్లాపూర్కు వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున శింగనమల మండలం లోలూరు క్రాస్ వద్ద ఆ వాహనాన్ని హైదరాబాదు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో బొలేరో వాహనం బోల్తాపడి దాని డ్రైవర్ మహ బూబ్బాష అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ హరినాథ్, క్లీనర్కు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.