సౌదీ అరేబియాలో మోతె వాసి మృతి
ABN , First Publish Date - 2020-02-23T07:15:29+05:30 IST
బతుకుదెరువు కోసం సౌదీ అరెబియాకు వెళ్లి అక్కడ రోడ్డు ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన మండలం లోని మోతె
వేల్పూర్, ఫిబ్రవరి 22: బతుకుదెరువు కోసం సౌదీ అరెబియాకు వెళ్లి అక్కడ రోడ్డు ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన మండలం లోని మోతె గ్రామానికి చెందిన ఐనార్ల నారా యణ (32) మృతదేహం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. ఆరు నెలల క్రితం సెల వుపై ఇక్కడికి వచ్చి తిరిగి సౌదీ అరేబియాకు వెళ్లిన నారాయణ ఐదు రోజుల క్రితం పికాప్ వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వా హనం బోల్తా పడింది. దీంతో నారాయణ అక్క డికక్కడే మృతి చెందినట్టు సౌదీలో ఉన్న మోతె గ్రామస్థుల ద్వారా తెలి సింది. మృతుడు నారాయణకు భార్య లక్ష్మీ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సౌదీలో ఉన్న మృతుని బంధువులు, మోతె గ్రామస్థుల సహకారంతో నారాయణ మృతదేహం మరో ఐదు రోజుల్లో ఇక్కడికి వస్తున్నట్టు కుటు ంబీకుల ద్వారా తెలిసింది. నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకో వాలని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కోరుతున్నారు.