గాళ్ ఫ్రెండ్ను చంపి.. మృతదేహాన్ని గోడలో పెట్టి పూడ్చేసిన ప్రియుడు!
ABN , First Publish Date - 2021-01-16T22:18:44+05:30 IST
పెళ్లి చేసుకోమన్న పాపానికి ఓ వ్యక్తి తన గాళ్ఫ్రెండ్ను అత్యంత కిరాతకంగా చంపి తన ఫ్లాట్ గోడలో మృతదేహాన్ని
పాల్ఘర్: పెళ్లి చేసుకోమన్న పాపానికి ఓ వ్యక్తి తన గాళ్ఫ్రెండ్ను అత్యంత కిరాతకంగా చంపి తన ఫ్లాట్ గోడలో మృతదేహాన్ని పూడ్చిపెట్టేశాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తులో అతడు చెప్పింది విని విస్తుపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు (30)కి 32 ఏళ్ల మహిళతో ఐదేళ్లుగా రిలేషన్షిప్ ఉంది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామంటూ గత కొన్ని నెలలుగా ఆమె ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది.
ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని నిందితుడు గతేడాది అక్టోబరులో వంగావ్ గ్రామంలోని తన ఫ్లాట్లో ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం గోడల్లో ఆమె మృతదేహాన్ని పెట్టి పూడ్చేశాడు. బాధితురాలు చాలా నెలలుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు నిందితుడి వద్ద ఆమె గురించి ఆరా తీశారు. గుజరాత్లోని వాపి నగరానికి వెళ్లినట్టు చెప్పాడు. అయితే, అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమని బలవంతంగా చేస్తుండడంతో చంపేశానని, ఆమె మృతదేశాన్ని ఫ్లాట్ గోడల్లో పూడ్చిపెట్టినట్టు తెలిపాడు. దీంతో గోడను తవ్వి చూసిన పోలీసులు బాధిత మహిళ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది అక్టోబరులోనే అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారి గతేడాది 21న ఆమె నిందితుడిని కలిసినట్టు పేర్కొన్నారు.