ప్రేయసికి వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేశారని తెలిసి.. కోపంతో వెళ్లిన ప్రియుడు?

ABN , First Publish Date - 2021-07-09T21:15:59+05:30 IST

ప్రేయసికి వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేశారని తెలుసుకున్న ప్రియుడు ఆవేశంతో ప్రేయసి మరదల్ని కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోహిత్(24) అనే వ్యక్తి షేర్పూర్ గ్రామంలో ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు కుటుంబసభ్యులు

ప్రేయసికి వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేశారని తెలిసి.. కోపంతో వెళ్లిన ప్రియుడు?

లక్నో: ప్రేయసికి వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేశారని తెలుసుకున్న ప్రియుడు ఆవేశంతో ప్రేయసి మరదల్ని కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. రోహిత్(24) అనే వ్యక్తి షేర్పూర్ గ్రామంలో ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆమెకు కుటుంబసభ్యులు వేరొకరితో పెళ్లి ఫిక్స్ చేశారని తెలుసుకుని ఆమె ఇంటికెళ్లి బలవంతంగా లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడే ఉన్న కుటుంబసభ్యులకు రోహిత్‌కు మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన రోహిత్ తన వెంట తీసుకెళ్లిన తుపాకీతో కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న ప్రేయసి మరదలికి తూటా తాకి కిందపడిపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. తుపాకీ శబ్దానికి చుట్టు పక్కన వాళ్లందరూ అక్కడికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-09T21:15:59+05:30 IST