హైదరాబాద్‌లో దారుణం.. దారిన పోతుంటే పొడిచేశాడు..!

ABN , First Publish Date - 2021-10-22T17:50:49+05:30 IST

మద్యం మత్తులో షాబాస్‌ హుస్సేన్‌ను...

హైదరాబాద్‌లో దారుణం.. దారిన పోతుంటే పొడిచేశాడు..!

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : హబీబ్‌నగర్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధి మల్లేపల్లి క్రాస్‌రోడ్స్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ వివరాలు వెల్లడించారు. గోడేకి కబర్‌లో నివాసం ఉండే షేక్‌ షాబాస్‌ హుస్సేన్‌ (23)ను మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి పొడిచి పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా అఫ్జల్‌సాగర్‌ మాన్గార్‌ బస్తీకి చెందిన సాయి కుమార్‌ (21)ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో షాబాస్‌ హుస్సేన్‌ను అకారణంగా పొడిచినట్లు సాయికుమార్‌ అంగీకరించాడని పోలీసులు వివరించారు. నిందితుడిపై పలు పోలీస్‌ స్టేషన్లలో 11 దొంగతనం కేసులు ఉన్నాయని, పీడీ యాక్ట్‌లో ఒకసారి జైలుకు వెళ్లి వచ్చాడని పేర్కొన్నారు. కొంత కాలంగా కత్తిని వెంటపెట్టుకొని తిరుగుతున్నట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-10-22T17:50:49+05:30 IST