పరువు కోసం చెల్లిని చంపిన సోదరుడు

ABN , First Publish Date - 2020-10-25T18:52:47+05:30 IST

ఇంటి పరువు పోతుందని భావించి ఆవేశంలో తన చెల్లినే చంపేశాడు ఓ సోదరుడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగింది...

పరువు కోసం చెల్లిని చంపిన సోదరుడు

ఇంటి పరువు పోతుందని భావించి ఆవేశంలో తన చెల్లినే చంపేశాడు ఓ సోదరుడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగింది. కుటుంబ సభ్యులంతా ఇంట్లోలేని సమయంలో ప్రియుడితో కలిసి తన చెల్లెలు ఉండడం చూసి అతనికి పట్టనంత కోసం వచ్చింది. కోపంలో ఒకరినొకరు దూషించుకున్నారు. ఇదంతా చూసి ఆమె ప్రియుడు బయటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆమెను ఆ సోదరుడు చితకబాదాడు.. గోడకు ఆమె తలను బలంగా వేసి కొట్టాడు. ఆమె ప్రాణం పోయేంత వరకూ కొట్టాడు. పోలీసులు అతనిపై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-25T18:52:47+05:30 IST