భార్యపై ప్రేమతో.. కనీవినీ ఎరుగని రీతిలో..

ABN , First Publish Date - 2020-08-11T01:54:45+05:30 IST

భార్యపై ప్రేమతో.. కనీవినీ ఎరుగని రీతిలో..

భార్యపై ప్రేమతో.. కనీవినీ ఎరుగని రీతిలో..

బెంగళూరు: శ్రీమతికి ప్రేమతో గొలుసో, నక్లెస్‌నో, వడ్డానమో కొనిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి భార్యపై ప్రేమతో మరో భార్యనే సృష్టించాడు. అదేనండి.. అచ్చం ఆమెను పోలిన మైనపు బొమ్మను తయారు చేయించాడు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గుప్తా తన భార్య మైనపు విగ్రహాన్ని తయారు చేయించి గృహప్రవేశం చేశారు. కొన్నేళ్ల క్రితం ఆయన సతీమణి రోడ్ యాక్సిడెంట్‌లో మరణించారు. కట్నం కోసమనో, తాగుడుకు అలవాడు పడో, మరే ఇతర కారణాలతోనో భార్యలపై తీవ్రమైన గృహహింసలు మన సమాజంలో సర్వసాధారణం అయిపోయాయి. అయితే అలాంటి వారికి శ్రీనివాస్ గుప్తా చేసిన పని కనువిప్పు కనిపించాలి. ఎందుకంటే, ఏకంగా జీవకళ ఉట్టి పడుతున్న ఆమె మైనపు విగ్రహాన్నే తయారు చేయించి ఇంట్లో పెట్టుకున్నారీయన. చెప్తే గానీ తెలిసేలా లేదు ఆమె కాదు అది విగ్రహమని. ఆ నవ్వు, చీర, నగలు ఎంత సహజంగా ఉన్నాయోనని చూసినవాళ్లు మురిసిపోతున్నారు.

Updated Date - 2020-08-11T01:54:45+05:30 IST