దారుణం: తొలుత బలాత్కారం..నాలుగేళ్ల తరువాత హత్య!

ABN , First Publish Date - 2020-07-17T01:12:05+05:30 IST

గతంలో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఓ దండుగుడు నాలుగేళ్ల తరువాత బాధితురాలిని ఆమె తల్లినీ కూడా హత్య చేశాడు.

దారుణం: తొలుత బలాత్కారం..నాలుగేళ్ల తరువాత హత్య!

లక్నో: గతంలో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ఓ దండగుడు నాలుగేళ్ల తరువాత బాధితురాలిని ఆమె తల్లినీ కూడా హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలో మంగళవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు యశ్‌వీర్‌ గతంలో బాధిత కుటుంబంతో స్నేహంగా మెలిగేవాడు. ఈ క్రమంలోనే అతడు 2016లో ఆ కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. జరిగిన ఘోరం గురించి ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యశ్‌వీర్ కటకటాలపాలయ్యాడు. అయితే ఇటీవల బెయిలు పై విడుదలైన అతడు బాధితురాలు, ఆమె తల్లిపై పగ తీర్చుకునేందుకు నిశ్చయించుకున్నాడు. మంగళవారం నాడు వీధిలో నడుచుకుంటూ వెళుతున్న తల్లీ కూతుళ్లపై ట్రాక్టర్‌ పోనిచ్చి హత్య చేశాడు. అయితే..ఈ నాలుగేళ్లలో ఇరు కుటుంబాలు పలుమార్లు గొడవలు జరిగాయి. డబ్బు విషయంలో యశ్‌వీర్ తండ్రికి బాధితురాలి తండ్రికి మధ్య వివాదం నెలకొంది. ఒకానొక సందర్భంగా వీరి గొడవ కారణంగా యశ్‌వీర్ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు దీంతో యశ్‌వీర్..బాధితురాలి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బాధితురాలి తండ్రిని అరెస్టు చేశారు. అయితే..అతడు 2018లో బెయిలుపై విడుదలైనట్టు తెలిసింది. ఈ క్రమంలోనే యశ్‌వీర్ ఇటీవల తల్లీకూతుళ్లపై పగ తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-07-17T01:12:05+05:30 IST