అద్దె కట్టలేదని చావబాదిన పోలీసు.. ఒంటికి నిప్పంటించుకున్న వ్యక్తి!
ABN , First Publish Date - 2020-08-04T04:00:22+05:30 IST
ఇంటి అద్దె కట్టలేదని ఓ వ్యక్తిని పోలీసులు చావబాదారు. దీంతో కలత చెందిన సదరు వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు.
చెన్నై: ఇంటి అద్దె కట్టలేదని ఓ వ్యక్తిని పోలీసులు చావబాదారు. దీంతో కలత చెందిన సదరు వ్యక్తి ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరిగింది. శ్రీనివాసన్ అనే వ్యక్తి స్థానికంగా పెయింటర్గా పనిచేసేవాడు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా అతని ఉపాధి దెబ్బతిన్నది. దీంతో నాలుగు నెలలుగా ఇంటి అద్దె కట్టలేకపోయాడు. ఈ విషయం తెలిసిన ఓ పోలీసు అధికారి అతన్ని చావబాదాడు. ఈ అవమానాన్ని భరించలేకపోయిన శ్రీనివాసన్ ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. 80శాతం కాలిన గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు.