కూతురు లేచిపోయి పెళ్లాడిందని తండ్రి ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-03-05T16:52:59+05:30 IST

ప్రేమికుడితో కలిసి ఇంట్లో నుంచి లేచిపోయి అతన్ని పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె తల నరికి చంపి...

కూతురు లేచిపోయి పెళ్లాడిందని తండ్రి ఏం చేశాడంటే...

జైపూర్ (రాజస్థాన్): ప్రేమికుడితో కలిసి ఇంట్లో నుంచి లేచిపోయి అతన్ని పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె తల నరికి చంపి, పోలీసుల ముందు లొంగిపోయిన కసాయి తండ్రి ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో జరిగింది. జైపూర్ నగరానికి  చెందిన శంకర్ లాల్ సైనీ (50)కి పింకీ అనే 19 ఏళ్ల వయసున్న కుమార్తె ఉంది. తన ఇష్టానికి విరుద్ధంగా పింకీ ఇంటి నుంచి వెళ్లిపోయి రోషన్ అనే ప్రేమికుడిని పెళ్లాడిందనే కోపంతో తండ్రి శకర్ లాల్ సైనీ ఆమె తల నరికి చంపాడు.పెళ్లి చేసుకున్నాక ఇంటికి తిరిగివచ్చిన పింకీని తండ్రి సైనీ హతమార్చి, అనంతరం పోలీసుస్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. సైనీని అదుపులోకి తీసుకొని హత్య కేసు నమోదు చేశామని పోలీసు అధికారి దీపక్ కుమార్ చెప్పారు.

Updated Date - 2021-03-05T16:52:59+05:30 IST