నగలషాపు యజమాని కళ్లలో కారం కొట్టి...
ABN , First Publish Date - 2020-08-21T12:18:43+05:30 IST
ఓ చోర శిఖామణి బంగారు నగల దుకాణానికి వచ్చి, షాపు యజమాని కళ్లలో కారం కొట్టి 50గ్రాముల బంగారాన్ని దోచుకునేందుకు చేసిన యత్నాన్ని స్థానికులు రట్టు....
50 గ్రాముల బంగారంతో పరారీకి యత్నం
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓ చోర శిఖామణి బంగారు నగల దుకాణానికి వచ్చి, షాపు యజమాని కళ్లలో కారం కొట్టి 50గ్రాముల బంగారాన్ని దోచుకునేందుకు చేసిన యత్నాన్ని స్థానికులు రట్టు చేసిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని సరఫా ప్రాంతంలో లవీన్ సోని బంగారు నగల దుకాణం నడుపుతున్నాడు. బుధవారం రాత్రి దేవాస్ పట్టణానికి చెందిన ఆనంద్ అనే దొంగ నగలు కొనేందుకు అని నగల దుకాణానికి వచ్చాడు. నగలు చూస్తూ షాపు యజమాని సోని కళ్లలో కారం కొట్టి 50 గ్రాముల బంగారం తీసుకొని పారిపోయేందుకు యత్నించాడు. అంతలో అప్రమత్తమైన ప్రజలు దొంగ ఆనంద్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నగల దుకాణంలో సీసీటీవీ ఫుటేజీలో బంగారం చోరీకి ఆనంద్ యత్నించాడని తేలింది.పోలీసులు నిందితుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకొని, అతన్ని అరెస్ట్ చేశారు.