కారు వెనుక సీట్లో మహిళ రచ్చ.. యాక్సిడెంట్ చేసి దొరికిపోయిన దొంగ!

ABN , First Publish Date - 2020-08-03T04:34:04+05:30 IST

కారు దొంగతనం చేసిన ఓ దొంగ వెనకు సీట్లో ఉన్న మహిళ కారణంగా పోలీసులకు దొరికిపోయాడు.

కారు వెనుక సీట్లో మహిళ రచ్చ.. యాక్సిడెంట్ చేసి దొరికిపోయిన దొంగ!

న్యూఢిల్లీ: కారు దొంగతనం చేసిన ఓ దొంగ వెనకు సీట్లో ఉన్న మహిళ కారణంగా పోలీసులకు దొరికిపోయాడు. దేశరాజధానిలోని గోపాల్ పూర్ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఓ మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. ప్రయాణం ప్రారంభమైన కొంత సేపటి తరువాత డ్రైవర్‌ను కారు ఆపమని చెప్పి..ఓ కూల్ డ్రింక్ కొనుక్కురావాలని అతడికి పురమాయించింది.


డ్రైవర్ షాపుకు వెళ్లిన కొద్ది నిమిషాల తరువాత.. ప్రిన్స్ శర్మ అనే వ్యక్తి కారును దొంగతనం చేసేందుకు వాహనంలోకి ఎక్కడు. వెనక సీట్లో ఉన్న మహిళ ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అతడు డోర్ వేసి కారును వేగంగా తోలడం ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు సహాయం కోసం పెద్ద పెట్టున అరుస్తూ వెనక నుంచి శర్మ చెంపలు వాయగొట్టింది. ఈ గొడవకు అతడు స్టీరింగ్‌పై అదుపు కోల్పోయి కారును రొడ్డుపక్కనే ఉన్న ఓ గోడకు ఢీకొట్టాడు.


అంతకుమునుపే.. ఈ రచ్చనంతా ప్రేట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు గమనించారు. దీంతో వారు ఆ కారును వెంబడించారు. ప్రిన్స్ శర్మ కారును ఢికొట్టే సమయానికి అతడిని చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. అయితే.. లాక్ డౌన్ కారణంగా జాబ్ కోల్పోవడంతోనే కారు దొంగతనానికి దిగినట్టు ప్రిన్స్ శర్మ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనలో మహిళకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-08-03T04:34:04+05:30 IST