ఛార్టర్ అకౌంటెంట్ 67 పేజీల సూసైడ్ నోట్ రాసి...

ABN , First Publish Date - 2020-06-24T15:22:14+05:30 IST

భార్యతో గొడవపడిన ఓ భర్త 48 గంటల్లో భార్యతోపాటు అత్తను హతమార్చిన దారుణ ఘటన...

ఛార్టర్ అకౌంటెంట్ 67 పేజీల సూసైడ్ నోట్ రాసి...

48 గంటల్లో ఘాతుకం...ఆపై ఆత్మహత్య

ఓ ఛార్టర్డ్ అకౌంటెంట్ ఏకంగా 67 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న అరుదైన ఘటన కోల్ కతాలో సంచలనం రేపింది.

కోల్‌కతా : భార్యతో గొడవపడిన ఓ భర్త 48 గంటల్లో భార్యతోపాటు అత్తను హతమార్చిన దారుణ ఘటన కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో వెలుగుచూసింది. బెంగళూరుకు చెందిన అమిత్ అగర్వాల్ ఛార్టర్డ్ అకౌంటెంటు. ఇతను కోల్‌కతాకు చెందిన శిల్పి అగర్వాల్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి పదేళ్ల వయసుగల కుమారుడున్నాడు. భార్యతోపాటు ఆమె కుటుంబంతో గొడవ పడిన అమిత్ అగర్వాల్  బెంగళూరులోని తన ఇంట్లో భార్య శిల్పి అగర్వాల్ ను కత్తితో గొంతు కోసి చంపి విమానంలో కోల్‌కతాకు వచ్చాడు. అమిత్ తన కుమారుడిని సోదరుడికి అప్పగించి అత్తింటికి వచ్చి అత్త లలితను కాల్చి చంపాడు. అనంతరం మామ సుభాష్ పై కాల్పులు జరిపేందుకు యత్నించగా అతను తలుపు బయట నుంచి వేసి తప్పించుకు పారిపోయాడు. అనంతరం అమిత్ తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుభాష్ పోలీసులను తీసుకొని వచ్చి చూడగా లలితతోపాటు అమిత్ మృతదేహాలు రక్తపుమడుగులో కనిపించాయి. మృతుడు అమిత్ మృతదేహం వద్ద 67 పేజీల సుధీర్ఘ సూసైడ్ నోట్ లభించింది. 66 పేజీలను టైపు చేసి, చివరిపేజీ చేతిరాతతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య వల్ల వివాదం ఏర్పడటంతో అత్తింటివారందరినీ ఎలా చంపాలో ప్రణాళిక వేసుకున్నాడని పోలీసులు చెప్పారు. బెంగళూరులోని భార్య శిల్పి అగర్వాల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకు తరలించారు. కేసులు నమోదు చేసుకున్న కోల్‌కతా, బెంగళూరు పోలీసులు హత్య ఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-24T15:22:14+05:30 IST