మనగ్రోమోర్‌ సెంటర్‌ తనిఖీ

ABN , First Publish Date - 2021-01-26T06:39:56+05:30 IST

పట్టణంలోని రాచర్ల రోడ్డులోని మన గ్రోమోర్‌ సెంటర్‌ను వ్యవసాయాధికారి ఎస్‌.రామ్మోహన్‌రెడ్డి బృందం ఆకస్మిక తనిఖీ చేసింది.

మనగ్రోమోర్‌ సెంటర్‌ తనిఖీ
మనగ్రోమోర్‌ సెంటర్‌ను తనిఖీ చేస్తున్న ఏవో

గిద్దలూరు టౌన్‌, జనవరి 25 : పట్టణంలోని రాచర్ల రోడ్డులోని మన గ్రోమోర్‌ సెంటర్‌ను వ్యవసాయాధికారి ఎస్‌.రామ్మోహన్‌రెడ్డి బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. అనుమతి లేని రెండు కంపెనీలకు సంబంధించిన బయో ఉత్పత్తులు అమ్ముతున్నట్లు గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన బయోఉత్పత్తుల విలువ రూ.1,03,650 ఉంటుందని రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మన గ్రోమోర్‌ సెంటర్‌ మేనేజర్‌ వల్లెల రాజారెడ్డికి నోటీసులు అందజేశారు.

Updated Date - 2021-01-26T06:39:56+05:30 IST