New Delhi:మాజీ ఐఆర్‌ఎస్ అధికారిణి ప్రీతాహరిత్ కాంగ్రెస్‌కు గుడ్ బై...పార్టీపై సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-02T17:27:27+05:30 IST

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఐఆర్ఎస్ అధికారిణి ప్రీతా హరిత్ ఆ పార్టీకి రాజీనామా చేశారు...

New Delhi:మాజీ ఐఆర్‌ఎస్ అధికారిణి ప్రీతాహరిత్ కాంగ్రెస్‌కు గుడ్ బై...పార్టీపై సంచలన వ్యాఖ్యలు

 పార్టీ అధ్వానంగా ఉంది...అనాథలా మారింది

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఐఆర్ఎస్ అధికారిణి ప్రీతా హరిత్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2019లో ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రీతా హరిత్ తాజాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన ప్రీతా హరిత్ కాంగ్రెస్ పార్టీ నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


దళిత బహుజన సంఘం హక్కుల కోసం పనిచేయడానికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరగా, కాంగ్రెస్ పార్టీ నిర్వహణ అధ్వానంగా ఉందని, పార్టీ అనాథలా మారిందని, ఎవరికి రిపోర్ట్ చేయాలో, ఎవరు పని అప్పగిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని ప్రీతా హరిత్ ఆరోపించారు.ప హరిత్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ఆదాయపు పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనరుగా పనిచేశారు. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వదిలారు. 


Updated Date - 2021-10-02T17:27:27+05:30 IST