పరిహారం చెల్లించాకే పనుల నిర్వహణ
ABN , First Publish Date - 2020-08-02T11:01:27+05:30 IST
యానాం పరిసర ప్రాంతాల్లో ఓన్జీసీ చమురు సంస్థ తమ కార్యకలపాలు నిర్వహించుకోవాలంటే మత్య్సకారులకు పరిహారం చెల్లించాలని ..
మత్స్యకార నాయకుల ఆందోళన
యానాం, ఆగస్టు 1: యానాం పరిసర ప్రాంతాల్లో ఓన్జీసీ చమురు సంస్థ తమ కార్యకలపాలు నిర్వహించుకోవాలంటే మత్య్సకారులకు పరిహారం చెల్లించాలని మత్య్సకార సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. యానాం ముఖద్వారం వద్ద చమురు సంస్థకు చెందిన యంత్రాలు కలిగిన వాహనాలను నాయకులు నిలిపివేశారు. సంస్థ కార్యకారాపాల వల్ల ఉపాధి కోల్పోయిన మత్య్సకార కుటుంబాలకు పరిహారం చెల్లించే వరకు సంస్థ నిర్వహించబోయే పనులను అడ్డుకుంటామన్నారు. ఇప్పటికే పలు సంస్థలు చెల్లించాల్సిన పరిహారం పూర్తిగా చెల్లించకుండా తమకు అన్యాయం చేశాయన్నారు.