పెళ్లైన రోజే వరుడి మృతి

ABN , First Publish Date - 2021-02-27T14:03:48+05:30 IST

వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. రామనాథపురం జిల్లా ఇళంజసోంబూరుకు చెందిన మలైస్వామి కుమారుడు విఘ్నేశ్వరన్‌ (27)కు సాయల్‌కుడికి చెందిన యువతితో...

పెళ్లైన రోజే వరుడి మృతి

చెన్నై/పెరంబూర్‌ (ఆంధ్రజ్యోతి): వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. రామనాథపురం జిల్లా ఇళంజసోంబూరుకు చెందిన మలైస్వామి కుమారుడు విఘ్నేశ్వరన్‌ (27)కు సాయల్‌కుడికి చెందిన యువతితో గురువారం ఉదయం  వివాహం జరిగింది.  వివాహం అనంతరం వధువు ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విఘ్నేశ్వరన్‌ హఠా త్తుగా గుండె పోటుకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని వెంటనే సాయల్‌కుడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో విషాధఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-02-27T14:03:48+05:30 IST