పెళ్లైన రోజే వరుడి మృతి
ABN , First Publish Date - 2021-02-27T14:03:48+05:30 IST
వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. రామనాథపురం జిల్లా ఇళంజసోంబూరుకు చెందిన మలైస్వామి కుమారుడు విఘ్నేశ్వరన్ (27)కు సాయల్కుడికి చెందిన యువతితో...
చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందిన ఘటన విషాదానికి దారితీసింది. రామనాథపురం జిల్లా ఇళంజసోంబూరుకు చెందిన మలైస్వామి కుమారుడు విఘ్నేశ్వరన్ (27)కు సాయల్కుడికి చెందిన యువతితో గురువారం ఉదయం వివాహం జరిగింది. వివాహం అనంతరం వధువు ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విఘ్నేశ్వరన్ హఠా త్తుగా గుండె పోటుకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని వెంటనే సాయల్కుడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వివాహం జరిగిన రోజునే వరుడు మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో విషాధఛాయలు అలుముకున్నాయి.