మంచిర్యాలలో పెద్దపులి సంచారం
ABN , First Publish Date - 2020-10-29T13:27:16+05:30 IST
జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.
మంచిర్యాల: జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన గ్రామస్తులు పులి సంచారాన్ని గుర్తించారు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని... అక్కడ ఉన్న అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ చేశారు.