సల్పల వాగులో చిక్కుకున్న యువకులు

ABN , First Publish Date - 2021-07-23T18:20:46+05:30 IST

కాశీపేట మండలం, సల్పల వాగులో చిక్కుకున్న ముగ్గురు యువకులను అధికారులు కాపాడారు.

సల్పల వాగులో చిక్కుకున్న యువకులు

మంచిర్యాల జిల్లా: కాశీపేట మండలం, సల్పల వాగులో చిక్కుకున్న ముగ్గురు యువకులను అధికారులు కాపాడారు. గజ ఈతగాళ్లు ప్రాణాలకు తెగించి అత్యంత చాకచక్యంగా యువకులను రక్షించారు. గురువాపూర్‌కు చెందిన యువకులు నిన్న చేపల వేటకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వరద మధ్యలోనే యువకులు చిక్కుకుపోయారు. ఎత్తైన ప్రదేశానికి చేరుకుని కాపాడాలంటూ కేకలు వేశారు. అయితే అప్పటికే చీకటయింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గజ ఈతగాళ్లను రప్పించారు. వరదలో దిగిన ఈతగాళ్లు తాళ్ల సహాయంతో ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు.

Updated Date - 2021-07-23T18:20:46+05:30 IST