Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద
ABN , First Publish Date - 2021-09-29T13:19:03+05:30 IST
జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 47 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 47 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 6 లక్షల 50వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 6లక్షల 60 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ 16.9426 టీఎంసీలుగా కొనసాగుతోంది.
మరోవైపు ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తింది. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎన్టీఆర్ నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పాత మంచిర్యాల, జైపూర్, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.