సీఎంను కలిసిన మంచిరెడ్డి కిషన్రెడ్డి
ABN , First Publish Date - 2022-01-28T03:56:44+05:30 IST
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన
ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్, జనవరి 27 : టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్పర్సన్ అనితాహరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తదితరులున్నారు. అనంతరం శంషాబాద్లో కొత్తగా నిర్మించిన జిల్లా తెలంగాణ భవన్ను మంచిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ సమావేశంలో మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్, మహేశ్రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, మెతుకు ఆనంద్, సుధీర్రెడ్డి కార్తీక్రెడ్డి, ఉన్నారు.