చిరంజీవిని కలుస్తా: మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-10-14T19:00:52+05:30 IST

త్వరలో చిరంజీవిని కలుస్తానని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తనకు ఓటు వేసి, తన గెలుపులో భాగమైన నందమూరి బాలకృష్ణను మంచు విష్ణు, మోహన్ బాబు గురువారం ఆయన ఇంటికి వెళ్లి కలిశారు.

చిరంజీవిని కలుస్తా: మంచు విష్ణు

హైదరాబాద్: త్వరలో చిరంజీవిని కలుస్తానని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తనకు ఓటు వేసి, తన గెలుపులో భాగమైన పలువురిని మంచు విష్ణు, మోహన్ బాబు గురువారం ఇంటికి వెళ్లి కలిశారు. ‘మా’ భవన నిర్మాణంలో అండగా ఉంటామని హామీ వచ్చినట్లు ఈ సందర్భంగా మంచు విష్ణు తెలియజేశారు. ‘మా’ అభివృద్ధి కోసం పెద్దలందరినీ కలుస్తానని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని విష్ణు చెప్పారు. ఇప్పటికే కోటా, కైకాల, పరుచూరి బ్రదర్స్‌ను కలిశానన్నారు. ఈనెల 16న ఉదయం 11:45 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. ప్రమాణస్వీకారానికి ప్రకాష్‌రాజ్ సహా అందరినీ ఆహ్వానిస్తానన్నారు. రాజీనామాలపై ఈసీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 





Updated Date - 2021-10-14T19:00:52+05:30 IST