మంద కృష్ణకు పిచ్చెక్కింది: పిడమర్తి
ABN , First Publish Date - 2020-09-25T07:02:55+05:30 IST
ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు పిచ్చెక్కిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు...
హైదరాబాద్, సెప్టెంబరు24 (ఆంధ్రజ్యోతి): ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చెప్పాలంటున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు పిచ్చెక్కిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేేస్త, ఆ అధికారం రాష్ర్టానికి లేదని సుప్రీం కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇక్కడ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మాదిగ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో పిడమర్తి మాట్లాడారు. పార్లమెంటులో చట్టం ద్వారానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యం అవుతుందన్నారు. మాదిగలకు అన్యాయం జరిగిందని, రావలసినన్ని ఉద్యోగాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంఎ్సఎస్ అధ్యక్షుడు గడ్డి యాదయ్య, ఇటుక రాజు, బీజేపీ నేత గద్దల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.