కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: మందకృష్ణ

ABN , First Publish Date - 2021-04-26T01:50:15+05:30 IST

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.

కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: మందకృష్ణ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తోనే కరోనా నుంచి విముక్తి కలుగుతుందని మందకృష్ణమాదిగ చెప్పారు.


ఇటీవల కేసీఆర్‌కు కరోనా సోకింది. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో ఆయన కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలోనే కేసీఆర్‌కు కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభ జరిగిన మూడు రోజులకే సీఎంకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, సభలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌తోపాటు, పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యకు సైతం పాజిటివ్‌ రావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. 

Updated Date - 2021-04-26T01:50:15+05:30 IST