మందకొడిగా ఏటి పండగ
ABN , First Publish Date - 2022-01-18T03:54:17+05:30 IST
ఏటి పండగ రెండో రోజు సోమవారం మందకొడిగా జరిగింది. మధ్యాహ్నం వరకు వర్షం రావడం, స్వర్ణముఖి నదిలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోవడంతో అంతంత మాత్రంగానే ప్రజలు పాల్గొన్నారు.
నాయుడుపేట టౌన్, జనవరి 17 : ఏటి పండగ రెండో రోజు సోమవారం మందకొడిగా జరిగింది. మధ్యాహ్నం వరకు వర్షం రావడం, స్వర్ణముఖి నదిలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోవడంతో అంతంత మాత్రంగానే ప్రజలు పాల్గొన్నారు. వచ్చిన కొద్ది మందీ తాము తీసుకువచ్చిన తినుబండారాలను ఆరగించారు. చిన్నారులు స్వర్ణముఖినదిలో జలకాలాడారు.