మండలాభివృద్ధికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-24T06:37:18+05:30 IST

ప్రణాళికాబద్ధంగా మండలాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్‌ ఎంపీపీ వీరఅచ్యుతజానకికి సూచించారు.

మండలాభివృద్ధికి కృషి చేయాలి

ఉప్పలగుప్తం, అక్టోబరు 23: ప్రణాళికాబద్ధంగా మండలాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్‌ ఎంపీపీ వీరఅచ్యుతజానకికి సూచించారు. ఎంపీపీగా ఎన్నికై తొలిసారిగా జానకి, ఆమె భర్త, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంగేటి రాంబాబు శనివారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎంపీపీ దంపతులను మంత్రి సన్మానించారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి, వరసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-10-24T06:37:18+05:30 IST