అసెంబ్లీ ఎమ్మెల్యేలకు దేవాలయం లాంటిది: బుద్ద ప్రసాద్

ABN , First Publish Date - 2021-11-29T20:37:28+05:30 IST

శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం లాంటిదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో ప్రతి ఒక్కరూ

అసెంబ్లీ ఎమ్మెల్యేలకు దేవాలయం లాంటిది: బుద్ద ప్రసాద్

అమరావతి: శాసనసభ ప్రజాప్రతినిధులకు దేవాలయం లాంటిదని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో ప్రతి ఒక్కరూ దాని పవిత్ర తను కాపాడాలన్నారు. ఇటీవల ఎపీ శాసనసభలో పరిణామాలు చూస్తే ఆవేదన కలుగుతుందని చెప్పారు. వినలేని, వినకూడని పదాలను శాసనసభలో సభ్యులు మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. స్త్రీలను కూడా కించపరిచేలా శాసనసభలోనే వ్యాఖ్యలు చేస్తున్నారని, నాయకులను ఎదిరించలేక.. ఇంట్లో ఆడవాళ్లను తిట్టే పరిస్థితికి దిగజారారని విమర్శించారు. శాసనసభలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే... ఆ రోజు సభ్యడిని సస్పెండ్ చేసే విధానం అమల్లోకి తేవాలని కోరారు. దేశవ్యాప్తంగా జరిగే స్పీకర్‌ల సదస్సులో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం చేయాలని బుద్ద ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-11-29T20:37:28+05:30 IST