చట్టాలపై అవగాహన తప్పనిసరి : జడ్జి

ABN , First Publish Date - 2021-10-18T06:09:36+05:30 IST

మండలంలోని అగళి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.

చట్టాలపై అవగాహన తప్పనిసరి : జడ్జి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్జి రాధాకృష్ణ

అగళి, అక్టోబరు 17: మండలంలోని అగళి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం చట్టాలపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మడకశిర సివిల్‌జడ్జి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈసందర్భంగా జడ్జి మాట్లడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో దిశా చట్టం, రైతుల సమస్యలు, ప్రజల సమస్యలపై తదతర విషయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎస్‌ఐ దివ్య, లాయర్లు ఉమే్‌షచంద్ర, గోపీనాథ్‌, పంచాయతీ కార్యదర్శి నరేష్‌, కో-ఆప్షన మెంబర్‌ నషీర్‌సాబ్‌, సర్పంచులు లక్ష్మమ్మ, నరసింహమూర్తి, కోర్టు కానిస్టేబుల్‌ హరీష్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు నాగోజీ, నూరుల్లా, మంజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T06:09:36+05:30 IST