Mangalagiri: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన వాహనం..పది గొర్రెలు మృతి
ABN , First Publish Date - 2021-10-31T15:20:09+05:30 IST
మంగళగిరిలో మండలంలో గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. కాజా గ్రామంలో రోడ్డు మీద ఉన్న గొర్రెల మందపైకి వాహనం దూసుకెళ్లింది
గుంటూరు: మంగళగిరిలో మండలంలో గుర్తు తెలియని వాహనం బీభత్సం సృష్టించింది. కాజా గ్రామంలో రోడ్డు మీద ఉన్న గొర్రెల మందపైకి వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.