మణిపూర్ లో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు
ABN , First Publish Date - 2020-08-15T22:43:05+05:30 IST
మణిపూర్ లో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు
ఇంపాల్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెగిపోతున్నాయి. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం పేర్కొంది.