ప్రాణం తీసిన మాంజా

ABN , First Publish Date - 2022-01-17T00:43:39+05:30 IST

సంక్రాంతి పండుగ రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం గాలి పటాలు ఎగురవేసే చైనా మాంజా దారం రోడ్డుపై వెళ్తున్న

ప్రాణం తీసిన మాంజా

మంచిర్యాల: సంక్రాంతి పండుగ రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం గాలి పటాలు ఎగురవేసే చైనా మాంజా దారం రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి మెడకు చుట్టుకుని గొంతు తెగి తీవ్ర రక్తస్రావంతో మృతిచెందాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన పాస్తం భీమన్న (36) 10 సంవత్సరాలుగా పాత మంచిర్యాలలో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంట్లో కోడిని కోసే క్రమంలో చేతికి గాయంమైంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. తిరిగి పాత మంచిర్యాల వైపు ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి వస్తుండగా గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించిన చైనా మాంజా దారం  భీమన్న మెడకు చుట్టుకుంది. దీంతో అతను కింద పడిపోయాడు. మాంజా దారంతో గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-01-17T00:43:39+05:30 IST