ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్‌ సింగ్‌

ABN , First Publish Date - 2021-10-14T06:56:35+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఆస్పత్రిలో చేరారు.

ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 13: మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్యంతో ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఆస్పత్రిలో చేరారు. జ్వరంతోపాటు నీరసంగా ఉండటంతో బుధవారం సాయంత్రం ఎయిమ్స్‌లో అడ్మిట్‌ అయ్యారు. 89 ఏళ్ల మన్మోహన్‌ సింగ్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా సోకిన సంగతి తెలిసిందే. మన్మోహన్‌ సింగ్‌కు  సోమవారం జ్వరం వచ్చి తగ్గిందని, అయితే మళ్లీ నీరసంగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హృద్రోగ నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని, సాధారణ చికిత్స తీసుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఆయన ఆరోగ్యంపై వదంతులను నమ్మవద్దని తెలిపింది. మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని, కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ, మాజీ మంత్రులు అశ్వనీ కుమార్‌, అభిషేక్‌ సింఘ్వీ తదితర నేతలు తెలిపారు.

Updated Date - 2021-10-14T06:56:35+05:30 IST