స్వతంత్ర అభ్యర్థిగా పనాజీ నుంచి ఉత్పల్ పారికర్...నేడు నామినేషన్ దాఖలు
ABN , First Publish Date - 2022-01-27T18:13:36+05:30 IST
గోవా మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పనాజీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు....
న్యూఢిల్లీ: గోవా మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ పనాజీ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. గురువారం ఉత్పల్ తన నామినేషన్ను సమర్పించనున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఉత్పల్ బీజేపీకి రాజీనామా చేశారు. గతంలోనే తాను అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఉత్పల్ ప్రకటించారు.పంజాబ్లో అకాలీదళ్ పార్టీ అమృత్సర్ (తూర్పు) స్థానం నుంచి మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియాను పోటీకి దింపింది. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై బిక్రమ్ సింగ్ ను పోటీలో పెట్టింది.