మన్‌ప్రీత్‌కు డీఎస్పీ నుంచి ఎస్పీగా ప్రమోషన్

ABN , First Publish Date - 2021-08-13T01:57:34+05:30 IST

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టిన హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌కు ప్రమోషన్ లభించనుంది.

మన్‌ప్రీత్‌కు డీఎస్పీ నుంచి ఎస్పీగా ప్రమోషన్

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టిన హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌కు ప్రమోషన్ లభించనుంది. మన్‌ప్రీత్‌కు ప్రస్తుతం ఉన్న డీఎస్పీ ర్యాంక్ నుంచి ఎస్పీ ర్యాంక్‌కు ప్రమోషన్ ఇస్తామని పంజాబ్ క్రీడల మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధీ తెలిపారు. ఒలింపిక్స్ చరిత్రలో హాకీలో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం తీసుకురావడంలో మన్‌ప్రీత్ సారధ్యంలో జట్టు చేసిన కృషి ఫలించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో భారత హాకీ జట్టు జర్మనీని ఓడించి చరిత్ర సృష్టించింది.

Updated Date - 2021-08-13T01:57:34+05:30 IST