వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి

ABN , First Publish Date - 2022-01-19T03:03:52+05:30 IST

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్నటికే మూడున్నర కోట్ల మందికి టీకా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు ఆరోగ్య రంగ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 సంవత్సరాలు పై బడిన వారికి 50 లక్షలకు పైగా డోసులు ఇచ్చినట్లు వెల్లడించింది. 


అటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 158 కోట్ల 4 లక్షలకు పైగా టీకాలు వేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా ఉపయోగించని 13 కోట్ల 25 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. 



Updated Date - 2022-01-19T03:03:52+05:30 IST