కొవిడ్‌ నియంత్రణకు సమర్థ చర్యలు చేపట్టండి

ABN , First Publish Date - 2021-05-06T06:31:07+05:30 IST

నియోజకవర్గ పరిధిలో కరోనాను కట్డడి చేయడానికి అత్య వసరంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు.

కొవిడ్‌ నియంత్రణకు సమర్థ చర్యలు చేపట్టండి


నోడల్‌ టీంతో మంత్రి సురేష్‌ 

ఎర్రగొండపాలెం, మే 5 : నియోజకవర్గ పరిధిలో కరోనాను కట్డడి చేయడానికి అత్య వసరంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేష్‌ ఆదేశించారు.  మండల టాస్క్‌ఫోర్సు అధికారులు, నియోజకవర్గ కొవిడ్‌ నోడల్‌ అధికారి ఎం శేషిరెడ్డి పర్యవేక్షణలో బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సమావేశం కాగా వీరితో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సురేష్‌ అమరావతిలోని క్యాంపుఆఫీసు నుంచి వీ డియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రభు త్వం ప్రకటించిన కర్ఫ్యూను అధికారులు అ మలు చేయాలన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వ్యక్తులకుపరీక్షలు నిర్వహించి ఒకే రోజులో ఫలితం చెప్పి వైద్య చికిత్స లు చేపట్టాలన్నారు. మెడిసిన్‌ కిట్లు పంపిణీ  చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. కొవిడ్‌ కేర్‌ సెంటరులో ఉన్న పాజిటివ్‌ కే సులకు వైద్యంతో పాటు ఆహారం వేళకు సరఫరా చేయాలని చెప్పారు. వీ డియో కాన్ఫరెన్సులో డీ ఎస్పీ కిశోర్‌కుమార్‌, డీఎ ల్‌డీవో సాయికుమార్‌, ఇన్‌చార్జి తహసీల్దారు వీ వీరయ్య,  ఎస్‌ఐ ము క్కంటి, ఈవోఆర్‌డీ కే రామసుబ్బారెడ్డి, నియోజకవర్గంలోని డాక్ట ర్లు, అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-06T06:31:07+05:30 IST