విల్లంబుతో దాడి చేసి హత్య
ABN , First Publish Date - 2021-04-17T06:27:58+05:30 IST
ఛత్తీస్గడ్లో మావోయిస్టులు వరుస విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సుక్మా జిల్లా గోరుకొండ, తోయపారా గ్రామాల నడుమ నిర్మాణదశలో ఉన్న రహదారి పనుల వద్దకు సాయుధ మావోయిస్టులు చేరుకున్నారు.
- రెండు వాహనాలకు నిప్పు
- ఛత్తీస్గడ్లో వరుస విధ్వంసాలకు పాల్పడుతున్న మావోయిస్టులు
చింతూరు, ఏప్రిల్ 16 : ఛత్తీస్గడ్లో మావోయిస్టులు వరుస విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సుక్మా జిల్లా గోరుకొండ, తోయపారా గ్రామాల నడుమ నిర్మాణదశలో ఉన్న రహదారి పనుల వద్దకు సాయుధ మావోయిస్టులు చేరుకున్నారు. రహదారి పనులకు వినియోగిస్తున్న ఒక ట్రాక్టర్తో పాటు లారీకి కూడా నిప్పు అంటించారు. అనంతరం రహదారి పనుల పర్యవేక్షుడిగా (గుమస్తాగా) విధులు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తిపై విల్లంబుతో దాడి చేయడంతోపాటు తలపై బండరాయితో మోది హత్య చేశారు. అదే దశలో మరో ఇద్దరు కూలీలను తమ వెంట కొద్ది దూరం తీసుకెళ్లిన మావోయిస్టులు అక్కడ వారిని హెచ్చరించి, అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు సమాచారం. కాగా మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.